నిజాలు మనకు తెలియవు, వాళ్ళ లాభాల కోసం ప్రచురణులు మనం తిరిగి ముద్రిస్తాం అది మన దౌర్భాగ్యం

ఆంధ్రుడు:అదేమిటి మేము సంపాదిస్తుంటే ప్రభుత్వం ఆ పన్ను ఈ పన్ను అని చెప్పి మా దగ్గర గుంజి రాయితీలు ఇస్తుంది కదా.
అవసరమైన వాటి మీద నియంత్రణ ఉండదు అనవసరమైన వాటి మీద రాయితీలు - మధ్యవర్తికి లాభాలు
స్నేహితుడు: మీకు వాళ్ళు కన్పించేది లాభం, కానీ నిజానికి వాళ్ళకు అది కిరాయి. ఇక ప్రభుత్వ పధకాల వలన లాభ పాడేది మధ్య వర్తి ఎలా అయ్యాడో తెలుసుకుందాం. మన పత్రికలైనా వార్త పత్రికలైన నిజాలు వ్రాయడం మానేసారు, ఇక అవి చదవడం మనం మోస పోవడం పరిపాటే. వాటిని తిరిగి తిరిగి ముద్రిస్తూ ఉంటారు, ఇక కొన్ని పత్రికలు కేవలం నిజాలు అబద్దాలుగా చెయ్యడానికి పుట్టాయి, ఆ పత్రికలు చట్టంలో లొసుగులు ప్రజలకు హితబోధ చేస్తుంటాయి.
ఆంధ్రుడు:అది అందరికీ తెలిసిందే ఇక మీరు చెప్పారు కదా ఎవరు లాభ పడతారు?
స్నేహితుడు: ముందుగా చితపండు - చింతపండు చేసే చేటు అంతా ఇంతా కాదు, దానిని నిత్యావసర వస్తువులలో ఎందుకు చేర్చారు అంటే, చింతపండు చేసే చేటు తెలుసుకుని
ఆంధ్రుడు:ఆ నేను చెబుతాను చింత చెట్ల మీద దెయ్యాలు ఉంటాయి కదా అదేనా!
స్నేహితుడు: చింతపండును ప్రజలకు దూరం చెయ్యడానికి చేసిన ప్రయత్నం చింత చెట్టు మీద దెయ్యాలు ఉంటాయి అని ప్రచారం చేసారు, కొందరు దాన్ని ఆసరా చేసుకున్నారు, దెయ్యాలు ఉన్నాయి అని ప్రచారాన్ని ఉపయోగించుకుని దోచుకున్నారు, ఇక ఈ దెయ్యం కన్నా ఆరోగ్య విషయం అందరికీ తెలుసు,ఎందుకంటే మన కళ్ళకు చేటు కనిపించనంత వరకూ అది అబద్దం అంటాం, తరువాత వాడకం మానేస్తాం. అప్పుడు అదే జరిగింది మధ్య వర్తులు చేసిన నిల్వలు పేరుకు పోయాయి. ప్రభుత్వం కొంటుంది అంటే ప్రజలకు అపనమ్మకం ఏర్పడుతుంది అందుకే ఈ రాయితీ ప్రకటనలు.
ఆంధ్రుడు:అంటే ప్రభుత్వం ఏ పని చేసినా మధ్య వర్తికే లాభమా?
స్నేహితుడు: కాదు ఇంకొకరు కూడా ఉన్నారు అది ఉత్తర దేశ భారతీయులు.
ఆంధ్రుడు:అదేమిటి, అది ఎలాగ?
స్నేహితుడు: సాధారణంగా మన ప్రాంతంలో ఎక్కువగా పండేవి బియ్యం, ఆ బియ్యం మీద రాయితీ ఇచ్చారు, కాని నిజంగా జనానికి చేరింది మక్కిపోయిన బియ్యం, అంతలా ఎందుకు మక్కి పోయేలా ఎందుకు ఉంచారు అంటే అవి దొరకని చోటుకు తరలించడానికి, అది ఉత్తర భారతావని వాళ్ళ కోసం, కొన్ని రోజులు దాచాకా అక్కడ వాళ్ళు మక్కి పోయిన బియ్యం కొనట్లేదు అందుకు కొంత పాత బియ్యం పంపించి తిరిగి ఈ బియ్యం వెనక్కి తెప్పించి ప్రజలకు అంట గట్టారు. ఇక రాయితీ ఇచ్చిన ఇంకో రెండు వస్తువులు కూడా ఆ ఉత్తర భారతీయులు కోసమే అవి గోధుమలు మరియు గోధుమ పిండి. వీటి మీద రాయితీ ఎందుకంటే సంధానం దొరకదు.
ఆంధ్రుడు:అదేమిటి కొవ్వు ఎక్కువ ఉన్నవారు తినాలి అంటారు కదా!
స్నేహితుడు: కొవ్వు ఎక్కువ ఉన్నవారు గోధుమలు తో తయారు చేసినవి తింటే సన్నబడతారు అనేది కొంతమందికే నిరూపితం అయ్యింది. ఇక మన దగ్గర గోధుమలు పెరగవు కదా, పెరిగేది ఉత్తర భారతంలో.
ఆంధ్రుడు: అంటే ప్రభుత్వం చేసే ఏ పని వల్ల సామాన్యుడు లాభ పడదు అన్నమాట.
స్నేహితుడు: నిజమే సామాన్యుడికే చేటు చేసేవే ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చి ప్రజలను మోసం చేసి బద్దకస్తులను చేసి మధ్యవర్తికి లాభం చేకూర్చేవే.
ఆంధ్రుడు:అవును palm oil వల్ల ఎందుకు మధ్య వర్తి లాభ పడ్డాడు?
స్నేహితుడు: దీనికి సహాయ పరిచే ఆధారాలు లేవు కానీ దీని వల్ల నష్ట పోయేది మన తర్వాత తరం.
ఆంధ్రుడు:అదెలాగ?
స్నేహితుడు: మనకు అశాస్త్ర విజ్ఞానము మీద నమ్మకం ఎక్కువ, నేను చెప్పేది మీకు రుచించదు.
ఆంధ్రుడు:sciense అంటే మీ దృష్టిలో అశాస్త్ర విజ్ఞానమే కదా, ఇంతకీ ఈ రోజు చెప్పేది ఏ విభాగం మీద?
స్నేహితుడు: Hybrid సంస్కృతీ!
(సశేషం..)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.